
న్యూస్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం పదిహేను నెలలు పూర్తి చేసుకుంది. సీఎం చంద్రబాబు తరచూ ప్రభుత్వ పనితీరును వివరించినా, మంత్రుల స్థాయిలో గట్టిగా కౌంటర్లు ఇవ్వడం లోపిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైసీపీ విమర్శలకు దూకుడుగా సమాధానాలు ఇవ్వగల ఫైర్ బ్రాండ్ల కొరత ఉందని అంటున్నారు.
సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఈ లోటును భర్తీ చేయగలరనే అభిప్రాయం బలపడుతోంది. ఎన్నో శాఖల్లో మంత్రి పదవులు నిర్వహించిన ఆయన, ప్రస్తుతం స్పీకర్గా ఉన్నా, జగన్పై చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఆయన చేసే వ్యాఖ్యలు కఠినంగా, కొన్నిసార్లు ప్రతిపక్షాలను నొప్పించేలా ఉంటాయి. అయినా కూడా ఇలాంటి దూకుడు ఇప్పుడు ప్రభుత్వానికి అవసరమని అనుకుంటున్నారు. ఎందుకంటే దుష్ప్రచారాలను బలంగా తిప్పికొట్టకపోతే ప్రజల్లో గందరగోళం కలగొచ్చు.
ముఖ్యంగా కూటమిలో కొత్త ముఖాలకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వడంతో సీనియర్ల లేమి ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. ఈ లోటు భర్తీ చేయడానికి అయ్యన్నను మంత్రివర్గంలోకి తీసుకురావాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం.
ఆయన లాంటి వారు ఉంటే పార్టీకి, ప్రభుత్వానికి ఊపిరి తీసుకొస్తారని కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయం వస్తోంది. కాబట్టి ఆయన పదవీ విరమణ ఎప్పుడైతే జరుగుతుందో, అది స్పీకర్గా కాకుండా మంత్రి పదవితోనే జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
