
టాలీవుడ్లో ఇప్పుడు సీక్వెల్స్, ఫ్రాంచైజీలు, సినిమాటిక్ యూనివర్స్ అనే ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. రాజమౌళి నుంచి సుకుమార్ వరకు పలువురు డైరెక్టర్లు ఈ మార్గంలో ముందుకు వెళ్తున్నారు. తాజాగా యాక్షన్ స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ కూడా తనకంటూ ఓ యూనివర్స్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.
కేజీఎఫ్ సిరీస్తో ఆయన దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. తర్వాత ప్రభాస్తో చేసిన సలార్ కూడా అదే స్థాయిలో హిట్ అయ్యింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేస్తున్న డ్రాగన్ పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలను రేపుతోంది.
ఈ మూడింటినీ ఒకే బ్యాక్డ్రాప్లో చూపించేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అంటే యశ్, ప్రభాస్, ఎన్టీఆర్లను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావాలని ప్లాన్ ఉన్నట్లు సమాచారం. ఇది నిజమైతే, ఇండియన్ సినిమాకు మినీ అవెంజర్స్ తరహా యూనివర్స్ వస్తుందనడంలో సందేహం లేదు.
ఇక రాబోయే రోజుల్లో ఈ లిస్టులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలూ చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో PNU (Prashanth Neel Universe) అనే కొత్త ట్రెండ్ మొదలవుతుందేమో అనే ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం డ్రాగన్ చిత్రీకరణ రియల్ లొకేషన్లలోనే జరుగుతుండటం ప్రత్యేకత. ఇక సీక్వెల్స్, మల్టీస్టారర్ ప్లాన్స్ తో కూడిన ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
